శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. లంకను కేవలం 39.4 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ కూడా చివర్లో 3 వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. లంక బ్యాటర్లలో ఓపెనర్ ఫెర్నాండో 50 పరుగులు చేయగా.. కుసాల్ మెండిస్ 34, దునిత్ వెల్లలాగే 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి శ్రీలంక ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది.