భారత ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దిఖీకి మరణానంతరం ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం దక్కింది. గతేడాది ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ టేకోవర్ సమయంలో ఆయన విధి నిర్వహణలో దుర్మరణం చెందారు. ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్ సంస్థకు చెందిన దానిశ్ సిద్దిఖీ, అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవేను విజేతలుగా ప్రకటించారు. భారత్లో కొవిడ్ విజృంభణ సమయంలో ఆయన తీసిన సామూహిక అంత్యక్రియల ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.