చెప్పడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా.. ఇది పూర్తిగా నిజం.. మనం బాత్ రూమ్ లో కూర్చునే టాయిలెట్ సీట్స్ ఇకపై సంగీతాన్ని కూడా వినిపించనున్నాయి. నమ్మట్లేదా! కానీ నిజమండి బాబూ! అమెరికాకు చెందిన కోహ్లెర్ కంపెనీ తయారు చేసిన నుమీ 2.0 స్మార్ట్ టాయిలెట్ లో బిల్ట్ ఇన్ అలెక్సాతో పాటు స్పీకర్లు కూడా ఉండనున్నాయి. దీంతో పాటు కస్టమైజ్డ్ లైటింగ్ ఫీచర్ తో వస్తున్న ఈ టాయిలెట్ సీట్స్ ఖరీదు మన రూపాయల్లో అక్షరాలా రూ.9.50 లక్షలు.