ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యనటకు రావడానికి రెండు రోజుల ముందే సోము వీర్రాజు ఫేస్ బుక్ ఖాతా స్తంబించిపోయింది. అయితే దానిపై ఆలస్యంగా స్పందించిన వీర్రాజు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఖాతా హ్యాక్ చేసి అందులో వ్యక్తిగతంగా కొందరిని అవహేళన చేసేలా పోస్ట్ లు పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.