మాజీ నటి, హర్యానా బిజెపి నేత సోనాలీ ఫోగట్ హత్య కేసులో సిబిఐ తన ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. గోవా హోటల్ రూమ్ లో హత్యకు గురైన సోనాలీనీ ఆమె పిఎ, స్నేహితులే ఆస్తి కోసం చంపేశారని పేర్కొంది. ఈ మేరకు ఆమె పిఎ సుధీర్ సంగ్వాన్, స్నేహితుడు సుఖ్వీందర్ లపై ఛార్జీ షీటులో పలు ఆరోపణలు చేసింది. వీరిద్దరిపై సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 34, సెక్షన్ 36 ల కింద కేసు నమోదు చేసింది. దాదాపు 1000 పేజీల ఛార్జీ షీటును గోవాలోని మపూసా కోర్ట్ మేజిస్ట్రేట్ కు సిబిఐ ఈరోజు అందించింది.