కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ సోకినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. స్వల్ప జరం, ఇతర కోవిడ్ లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారని.. వైద్యం అందుతోందని తెలిపారు. కాగా సోనియా గాంధీ జూన్ 8న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఇప్పుడు కరోనా బారిన పడ్డారు.