విజయ్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం వారసుడు నుంచి ఎమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘అమ్మమ్మ నేనేమి వింటినమ్మా .. వాకిళ్ల నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా .. అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా’ అంటూ ఈ పాట సాగుతోంది. తల్లీకొడుకుల అనుబంధానికి అద్దం పట్టే పాట ఇది. తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా చిత్ర ఆలపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.