ఇటీవలే బిసిసిఐ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయిన క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రికెట్ పాలనా వ్యవహారాల్లో బిజీ కానున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ ఆఫ్ క్రికెట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. ఇదే జట్టుకు గంగూలీ 2019లో సలహాదారుగానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది బిసిసిఐ ప్రెసిడెంట్ కావడంతో ఢిల్లీని వదిలేసిన దాదా ఇప్పుడు మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పనిచేయనున్నాడు.