సీనియర్ నటులైన దక్షిణాది హీరోయిన్లను కాదని కేవలం 10 సినిమాలు చేసిన బాలీవుడ్ బ్యూటీలకు పద్మశ్రీ అవార్డు రావడంపై టాలీవుడ్ సీనియర్ నటి జయసుద ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ బుల్లితెర షో అన్ స్టాపబుల్ లో జయప్రదతో కలిసి హాజరైన ఆమె కేంద్ర నిర్ణయం సరికాదని విమర్శించారు. దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లను కాదని వివాదాస్పద నటులకు ఈ అవార్డులు దక్కడం బాధాకరమన్నారు. గిన్నీస్ రికార్డులకెక్కిన విజయ నిర్మలను కూడా కేంద్రం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.