5 మ్యాచ్ల టి20 సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ఢిల్లీ చేరుకుంది. రోహిత్, విరాట్లకు లేని ఈ సిరీస్కు కెప్టెన్గా కెఎల్ రాహుల్ను, రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గానూ నియమించారు. 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్లో దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యలు తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. సన్రైజర్స్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్తో పాటు పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్లకు సైతం ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ.