దేశంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు పారా గ్లైడింగ్ యాత్రికులు దుర్మరణం చెందిన ఘటనలు జరిగాయి. మొదటి ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సూరజ్ సంజయ్ షా (30) మనాలి లోని పారా గ్లైండింగ్ చేస్తున్న సమయంలో అతడి హార్నెస్ ఫెయిల్ అయింది. దీంతో వందల అడుగుల లోయలోకి పడిపోయిన అతడు అక్కడే దుర్మరణం చెందాడు. మరో ఘటనలో 50 ఏళ్ళ దక్షిణ కొరియా వ్యక్తి షిన్ బ్యోన్ మూన్ వడోదర లో పారాగ్లైడింగ్ చేస్తూ అతడి కెనోపీ ఫెయిల్ కావడంతో 50 అడుగుల లోయలో పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.