బెలగావి నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పక్షిని గుద్దిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమదంలో విమానం రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే విమానాన్ని ఢిల్లీలో క్షేమంగా ల్యాండ్ చేశారు. 187 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కర్ణాటకలోని బెలగావి నుంచి వెళ్తున్న సమయంలో పక్షిని ఢీకొట్టిందని స్పైస్జెట్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో దిగిన అనంతరం మరమ్మత్తుల కోసం ఈ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.