భారత్ తో వచ్చే నెల 3 నుంచి జరగనున్న టి20, వన్డే సిరీస్ ల కోసం శ్రీలంక 20 మందితో జట్టును ప్రకటించింది. రెండు ఫార్మాట్లకూ దాసున్ శనక కెప్టెన్ గా ఉండగనుండా.. వన్డేలకు కుశాల్ మెండీస్, టి20లకు వహిందు హసరంగ వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఆ దేశ లంక ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్న క్రికెటర్లకు భారత్ తో సిరీస్ కోసం శ్రీలంక ఎంపిక చేసింది. అవిష్క ఫెర్నాండోతో పాటు ఏడాది పాటు నిషేధం విధించిన చమీక కరుణ రత్నను కూడా లంక బోర్డ్ తమ జట్టులోకి తీసుకుంది.