ముందుగా బ్యాటర్లకు అనుకూలించే పిచ్ పై టాస్ నెగ్గి కూడా బౌలింగ్ తీసుకున్న కెప్టెన్ పాండ్య నిర్ణయం నుంచి నిన్నటి మ్యాచ్ లో భారత్ కు అన్నీ ప్రతికూలాంశాలే. ఫాంలో ఉన్న అర్షదీప్ 5 నోబాల్స్ వేయడం.. తొలి మ్యాచ్ హీరో శివం మావి.. ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు ఇవ్వడానికి తోడు.. ఫీల్డింగ్ వైఫల్యాలు సైతం భారత్ ను దెబ్బతీశాయి. దీంతో 2వ టి20లో భారత్ ఓటమి పాలైంది. ముందుగా శ్రీలంక జట్టు 206 పరుగులు చేస్తే భారత్ 190 పరుగులు మాత్రమే చేసింది. అక్షర్ పటేల్ 61 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.