తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉన్న ద్వీప దేశం శ్రీలంక.. అక్కడి రైతులను భారీ ఎత్తున వరి పండించాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో ఆహార అత్యయిక స్థితి తలెత్తే అవకాశాలు ఉన్నందున ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు గానూ వరిని భారీ ఎత్తున పండించాలని విజ్ఞప్తి చేస్తోంది. చమురు, ఆహారం సహా కీలకమైన వస్తువుల కొనుగోళ్ళకు చెల్లించడానికి మంగళవారం పన్నులను భారీగా పెంచిన అక్కడి ప్రభుత్వం తాజాగా వరి ధాన్యం పంటపై రైతులకు మార్గదర్శకాలు చేసింది.