విక్రమ సింగే​: ప్రజలు శాంతిస్తేనే పనిచేయగలుగుతా

By udayam on May 13th / 1:40 pm IST

శ్రీలంక కొత్త ప్రధాని రణిల్​ విక్రమ సింఘే ఆ దేశ ప్రజలు నిరసనలను విడనాడి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలందరూ మూడు పూటలా తినేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్ధిక గడ్డు స్థితి నుంచి బయట పడేందుకు చిరకాల స్నేహితులు భారత్​, జపాన్​ దేశాల సాయం కోరానని ఆయన చెప్పారు. ‘వారు శాంతిస్తేనే నేను పనిచేయగలుగతా. పరిస్థితులు మరింత దిగజారొచ్చు. కానీ అవన్నీ చక్కబడతాయి. అలాంటి దేశాన్ని నేను నిర్మించగలను’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​