టెన్త్​ పేపర్లు లీక్​ కాలేదు : ఎపి

By udayam on May 5th / 5:25 am IST

రాష్ట్రంలో టెన్త్​ పరీక్షా పత్రాలు లీక్​ అవుతున్నాయన్న వార్తల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి మరీ టెన్త్​ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్న ఆయన.. మాల్​ ప్రాక్టీస్​ చేసే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. టెన్త్​ క్వశ్చన్​ పేపర్లు లీక్​ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీనే రాద్దాంతం చేస్తోందని ఆయన తిప్పికొట్టారు. విద్యార్థులకు సాయం చేయడానికి చూసిన 38 మంది టీచర్లను సస్పెండ్​ చేశామన్నారు.

 

ట్యాగ్స్​