మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదన్న బాధలో ఫ్యాన్స్ ఇప్పటికే ట్వీట్లు పెడుతున్నారు.కథానాయికలుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికైనట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు.