బెంగాల్ లో కేవలం 4 రోజుల క్రితమే ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు దుండగులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. హౌరా నుంచి ప్రతీ సోమవారం ప్రారంభమయ్యే ఈ ట్రైన్ పై మల్దా లోని కుమర్ గంజ్ స్టేషన్ వద్ద దాడి చేశారు. ఈ దాడిలో ట్రైన్ లోని కోచ్ నెం.సి13 అద్దాలు పగిలిపోయాయి. ఈ ట్రైన్ ను డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో మొదలైన 7వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఇది.