విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో ఓ ఎంసీఏ విద్యార్థిని ఫ్లాట్ఫాం-రైలు మధ్య ఇరుక్కుని నరకయాతన పడ్డ ఘటన ఈ ఉదయం చోటు చేసుకుంది. బయటకు రాలేక ఆమె దాదాపు 2 గంటల పాటు చిత్రవధ అనుభవించింది. అన్నవరానికి చెందిన 20 ఏళ్ల శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ చదువుతోంది. రోజులానే రాయగడ ఎక్స్ప్రెస్ రైలులో దువ్వాడ చేరుకుంది. స్టేషన్లో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ కిందికి జారిపడింది. రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కుపోయిన చోట ప్లాట్ఫామ్ను బద్దలుగొట్టి ఆమెను రక్షించారు.
RPF saves Student stuck between Train and Platform at Duvvada railway station of Andhra Pradesh.#Vizag #Vishakapatnam #AndhraPradesh #Accident #Duvvada pic.twitter.com/YNozRkA2cY
— Arun Pruthvy Sandilya (@arunsandilya) December 7, 2022