వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్, రష్మిక మందన్నా తెరకెక్కిన ‘వారీసు’ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 11న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే తెలుగు వెర్షన్ ఆలస్యంగా విడుదల చేయనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.