హైదరాబాద్ చేతిలో ముంబై రనౌట్ అయింది. గెలుపు తధ్యం అనుకున్న ఆ జట్టు చివర్లో టిమ్ డేవిడ్ను కోల్పోయి ఓటమి పాలైంది. ఆపై 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ వికెట్ మెయిడెన్ చేయడం కూడా ముంబై ఓటమికి కారణమైంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్లో త్రిపాఠి 76, ప్రియం గార్గ్ 42, పూరన్ 38 చేయడంతో 193 పరుగులు చేసింది. ఆపై రోహిత్ 48, ఇషాన్ 43, టిమ్ డేవిడ్ 46తో రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. 5 ఓటముల తర్వాత హైదరాబాద్ గెలుపు రుచి చూసింది.