ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఆక్రమణల కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్ట్ నిరాకరించింది. ఈ విషయంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను తిరస్కరించిన కోర్టు.. కూల్చివేతలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులోనే దీనిపై తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించిన సుప్రీం.. బాధితులు వేయాల్సిన పిటిషన్ను రాజకీయ పార్టీలు ఎందుకు వేస్తున్నాయని ప్రశ్నించింది. మీ మీ రాజకీయాలకు సుప్రీంలాంటి అత్యున్నత న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని పేర్కొంది.