సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ లెదుర్కొంటున్న ఇంద్రాణి గత ఆరున్నరేళ్ళుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. బెయిల్ పిటీషన్ సందర్భంగా.. ఇప్పట్లే ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని, కాబట్టి బెయిల్ను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆమె తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహగ్తి వాదనలు వినిపించారు.