దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించినా, తిట్టినా లేదా కొట్టినా రూ.50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా … అత్యున్నత న్యాయస్ధానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై పలు జర్నలిస్టు సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు తీర్పును ఆహ్వానించారు.