సుప్రీం: రాజద్రోహం చట్టంపై కేసులుపెట్టొద్దు

By udayam on May 11th / 7:51 am IST

దేశ ద్రోహ చట్టాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంపై పున:సమీక్ష జరుగుతున్నందున ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ దేశ ద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. అదే సమయంలో దీనిపై ఎలాంటి విచారణను ప్రారంభించడం లేదని సైతం వెల్లడించింది. ఈ చట్టం కింద ఇప్పటికే అరెస్ట్​ అయి విచారణ ఎదుర్కొంటున్న వారు, జైలులో ఉన్న వారు బెయిల్​ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని సిజేఐ ఎన్వీ రమణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ట్యాగ్స్​