రాజీవ్​ గాంధీ హత్య కేసు: పెరరివాలన్​ను విడుదల చేయండి

By udayam on May 18th / 6:31 am IST

రాజీవ్​గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎజి పెరరివాలన్​ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గత 30 ఏళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న అతడిని విడుదల చేయాలని జస్టిస్​లు ఎల్​.నాగేశ్వరరావు, బిఆర్​.గవాయి, ఎఎస్​.బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పుచెప్పింది. ఆర్టికల్​ 142, ఆర్టికల్​ 161ల కింద వీరి విడుదలపై తమిళనాడు గవర్నర్​ జాప్యం చేయరాదంది. పెరరివాలన్​ విడుదలైతే ఇదే కేసులో శిక్ష పడ్డ నళిని, మురుగన్​లూ విడుదలకు మార్గం సుగమం అవుతుంది.

ట్యాగ్స్​