2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ‘పెద్ద నోట్ల రద్దు’ పై సుప్రీంకోర్టు వాదనలను పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిర్ణయంపై దాఖలైన అన్ని పిటిషన్లు, పిల్స్ పై వాదనలను విన్న సుప్రీం ఈ క్రమంలో ‘ఇంత పెద్ద నిర్ణయంపై తాము చేతులు కట్టుకుని కూర్చోలేం’ అని వ్యాఖ్యానించింది. 2016లో 500, 1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.