మూడే ళ్ళ క్రితం 2019 డిసెంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ బూటకమని సుప్రీంకోర్ట్ నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఇచ్చింది. తమ వద్ద నుంచి పిస్టల్స్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించడంతోనే వారిని ఎన్కౌంటర్ చేశామన్న పోలీసుల వాదన అవాస్తమని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఉదంతంపై మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సిర్పూర్కర్, జస్టిస్ రేఖా బల్డోటా, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్లు తమ నివేదికను తయారు చేశారు.