ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్న బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దు కావడంతో ఆయన స్థానంలో దక్షిణ అమెరికాలో అతి చిన్న దేశమైన సరినామ్ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.
ఈ మేరకు రాజ్పథ్లో జనవరి 26న జరిగే పరేడ్కు సంతోఖి హాజరై త్రివిధ దళాల విన్యాసాల్ని వీక్షించనున్నారు. గతవారం జరిగిన ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమానికి సైతం సంతోఖి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తనకు దక్కిన గౌరవానికి సంతోషం వ్యక్తం చేస్తూ సరినామ్ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు ఎలాంటి వీసా పర్మిట్లు అవసరం లేదని సంతోఖి ప్రకటించారు.