బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి రెండేళ్ళు గడుస్తున్నా అతడి మరణంపై ఉన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదు. ఆయనది ఆత్మహత్యేనని గతంలో దర్యాప్తు సంస్థలు తేల్చినా ఫ్యాన్స్ అతడిది హత్యేనని అనుమానిస్తున్నారు. తాజాగా సుశాంత్ కు పోస్ట్ మార్టం చేసిన కూపర్ ఆసుపత్రిలోని ఓ సహాయకుడు రూప్ కుమార్ ఎఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సంచలనంగా మారింది. సుశాంత్ శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని, మెడపైనా రెండు మూడు ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేస్తుండగా వీడియో తీయాల్సి ఉంటుందని అయితే, పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఫొటోలు మాత్రమే తీశామని ఆయన పేర్కొన్నారు.