Earthquake

పాపులర్ వార్తలు

  • కొత్తగూడెంలో స్వల్ప భూకంపం.. ఇళ్ళ నుంచి ప్రజలు పరుగులు

    10 months ago

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం భూమి కొద్ది క్షణాలు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులుపెట్టారు. పాల్వంచలో సరిగ్గా 2.13 గంటలకు భూమి కంపించింది. భూకంపం ధాటికి.. ఇళ్లలోని వస్తువులు వాటంతట అవే కింద పడిపోయాయి. కొన్ని చోట్ల గోడలు బీటలు వారినట్టు తెలుస్తుంది. ఒక్క‌సారిగా (ఇంకా చదవండి)

  • అరుణాచల్​ ప్రదేశ్​ లో స్వల్ప భూకంపం

    10 months ago

    దేశ తూర్పు రాష్ట్రం అరుణాచల్​ ప్రదేశ్​ లో ఈరోజు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 3.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం రాష్ట్రంలోని తవాంగ్​ పట్టణంలో సంభవించింది. శుక్రవారం ఉదయం 4.24 గంటలకు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం పై ఇంకా (ఇంకా చదవండి)

  • ఇండోనేషియా: జకార్తాను ఊపేసిన భారీ భూకంపం

    10 months ago

    ఇండోనేషియా రాజధాని జకార్తాను ఈరోజు భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేల్​ పై 5.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి జరిగిన నష్టం పై ఇంకా ఎలాంటి అంచనాలు బయటకు రాలేదు. ఐలాండ్​ జావా మొత్తంగా ప్రకంపనలు వచ్చాయని సాక్షులు చెబుతున్నారు. జకార్తా లోని భారీ బిల్డింగులు కొన్ని (ఇంకా చదవండి)

  • జమ్మూ లో స్వల్ప భూకంపం

    10 months ago

    జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో బుధవారం రిక్టర్‌ స్కేలుపై 3.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకారం, భూకంపం స్థానం కత్రాకు తూర్పు ఆగ్నేయ దిశలో 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉదయం 9:15 గంటలకు సంభవించింది.ఈ సందర్భంగా భూకంప తీవ్రతను తెలియజేస్తూ… భూకంప శాస్త్ర (ఇంకా చదవండి)

  • సంగారెడ్డిలో భూకంపం..

    10 months ago

    సంగారెడ్డిలో భూకంపం చోటుచేసుకుంది. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. కోహీర్‌ మండలం బిలాల్‌పూర్‌లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కి పడి ఇళ్లలో నుండి బయటకు పరుగులు పెట్టారు.ఈ భూకంపం ధాటికి (ఇంకా చదవండి)

  • ఢిల్లీలో స్వల్ప భూకంపం

    10 months ago

    దేశ రాజధాని ఢిల్లీ భూకంపం సంభవించింది. న్యూఢిల్లీకి పశ్చిమాన 8 8 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టుగా నమోదైదని జాతీయ భూకంపం కేంద్రం వెల్లడించింది. రాత్రి 9.30 గంటల సమయంలో భూమి కంపిచినట్లు తెలిపింది. (ఇంకా చదవండి)

  • తుర్కియే : అంకారా నగరంలో భూకంపం

    10 months ago

    తుర్కియే రాజధాని అంకారాకు సమీపంలో భారీ భూకంపం బుధవారం ఉదయం సంభవించింది.రిక్టర్​ స్కేల్​ పై 6.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇస్తాంబుల్​, అంకారా నగరాలు చిగురుటాకులా ఊగిపోయాయి. ఆంకారాకు 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న డజ్‌సీ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప (ఇంకా చదవండి)

  • సాల్మన్​ ఐలాండ్స్​ లో 7 తీవ్రతతో భారీ భూకంపం.

    10 months ago

    సోమవారం ఇండోనేషియాలో సంభవించిన భూకంపం సృష్టించిన విలయతాండం మరవక ముందే మరో దేశంలోనూ భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్​ మహా సముద్రంలోని సాల్మన్​ ఐలాండ్స్​ లో మంగళవారం రాత్రి 7.0 తీవ్రతతో భూమి కంపించింది. భారీస్థాయిలో ప్రకంపనలు రావడంతో సాల్మన్ దీవుల రాజధాని హోనియారాలో భవంతులు తీవ్రంగా ఊగిపోయాయని ప్రత్యక్ష (ఇంకా చదవండి)

  • 268కి పెరిగిన ఇండోనేషియా భూకంప మృతులు..చిన్నారులే అధికం

    10 months ago

    ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం వచ్చిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 268కి చేరింది. సియాంజుర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా, భారీ నష్టం వాటిల్లింది. తొలుత 44 మంది మరణించారని అధికారులు చెప్పగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. (ఇంకా చదవండి)