రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో చిన్నారులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు అన్ని ప్రభుత్వ బస్సుల్లోనూ టికెట్ అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3–12 ఏళ్ళ చిన్నారులకు హాఫ్ టికెట్ అమలులో ఉండగా ఇప్పుడు 5 ఏళ్ళ లోపు వారికి ఉచిత సర్వీసును అందించనుంది. దీంతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల్లో లగేజ్ కోసం ఉంచిన స్థలాన్నీ ప్రయాణికుల కోసం కేటాయించనున్నారు.