ప్రయాణికుల బస్సుల్లో జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు గానూ తమిళనాడు ప్రభుత్వం పానిక్ బటన్ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ పానిక్ బటన్ రాకతో బస్సులో ప్రయాణించే మహిళలు, పిల్లలకు మరింత భద్రత కలగనుందని పేర్కొంది. చెన్నై వ్యాప్తంగా నడిచే 500ల బస్సుల్లో ఈ బటన్ను ఏర్పాటు చేశారు. తొలిదశలో 500లు, ఆపై 2,500లకు పైగా బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. లింక్ చేయబడ్డ సిసిటివి కెమెరాల సాయంతో ఈ బటన్ పనిచేస్తుంది.