దేశంలో అత్యధిక కంపెనీలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. దేశం మొత్తం మీద ఉన్న ఫ్యాక్టరీలలో 15 శాతం కంపెనీలు ఒక్క తమిళనాడులోనే ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 2020 లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం 38,837 ఫ్యాక్టరీలు ఉంటే.. గుజరాత్ లో 28,479 ఉంది. మూడో స్థానంలో మహారాష్ట్ర 25,610 ఫ/యాక్టరీలతో, ఆంధ్రప్రదేశ్ 19,924 ఫ్యాక్టరీలతో నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 19,184 ఫ్యాక్టరీలు ఉన్నాయి.