భర్త లేకుండా చిన్నారిని పెంచడం ఎంత కష్టమో ఈ తమిళనాడు మహిళను అడిగితే చెబుతుంది. పెళ్ళైన 15 రోజులకే భర్త గుండెపోటుతో మరణిస్తే పుట్టిన బిడ్డ కోసం తల్లి పెచ్చియమ్మల్ ‘తండ్రి’గా మారింది. సమాజంలో తనను తక్కువ చేసి చూస్తున్నారన్న అవమానంతో ఆమె తన సంప్రదాయ కట్టు, బొట్టును పక్కన పెట్టి లుంగీ, షర్ట్ వేసుకుంటూ రోజువారీ కూలిగా మారింది. దీంతో ఆమె అక్కడ అన్నాచి అనే పిలుస్తారు. 30 ఏళ్ళుగా ఆమె మగరాయుడుగానే క్రాఫ్ చేయించుకుంటూ తన పేరును కూడా ముత్తూగా మార్చుకుంది.