ప్రభాస్, పూజాహెగ్డేలతో పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ను తీసని డైరెక్టర్ రాధాకృష్ణ.. ఇప్పుడు ధనుష్ తో ఓ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ కు కథను వినిపించి సినిమాకు ఒప్పించిన ఈ యువ డైరెక్టర్.. ఈ మూవీని కూడా యువీ క్రియేషన్స్ బ్యానర్ తోనే చేయనున్నాడు. కేవలం తెలుగు, తమిళం భాషల్లోనే ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్ వరుసగా తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు నటిస్తున్న ‘సార్’ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుంటే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ మూవీని చేస్తున్నాడు ధనుష్.