హైదరాబాద్ పర్యటనలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. గత కొంత కాలంగా టిడిపి కి దూరంగా ఉంటున్న గంటా.. లోకేష్ తో భేటీపై సర్వత్రా ఆశక్తి పెరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్ లోని లోకేశ్ నివాసానికి వచ్చిన గంటా దాదాపు 40 నిమిషాల సేపు చర్చించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ భేటీ అనంతరం లోకేష్ ను నందమూరి తారక రత్న కలిశారు.
😍
Wow. Good to see both in one picture.#NaraLokesh #NandamuriTarakaRathna pic.twitter.com/AQuVRheSWh— Vinod Cherukuri (@vinodcherukuri) January 10, 2023