ప్రపంచంలోనే దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్ తన గుజరాత్ ప్లాంట్ ను దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటాలకు అప్పగించనుంది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ ఎంఓయూ పై సంతకం చేసింది. దీంతో గుజరాత్లోని ఫోర్డ్ ప్లాంట్ ఉన్న భూమి, బిల్డింగ్, వాహన తయారీ ప్లాంట్, మెషీన్లు, ఎక్విప్మెంట్ మొత్తం టాటాల సొంతం కానున్నాయి. ఇందుకోసం టాటా సంస్థ ఎంత మొత్తం చెల్లించిందీ మాత్రం బయటకు రాలేదు.