కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్పిసి నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ను టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ దక్కించుకుంది. ఇది కేంద్రం నిర్మిస్తున్న అతిపెద్ద సోలార్ పార్క్ కావడం గమనార్హం. రూ.1731 కోట్ల వ్యయంతో రాజస్థాన్లో దీనిని నిర్మించాలని ఎన్హెచ్పిసి సిద్ధమైంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుండగా 18 నెలల్లో పూర్తి చేయనుంది. ఏడాదికి 750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.