టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మరణించిన 8 మంది కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. రోజంతా కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఉండి మనోధైర్యం కల్పించాలని సూచించారు. మృతులకు ఆర్థికసాయం వెంటనే అందజేయాలన్నారు. కాగా, నేడు కందుకూరులో అన్ని కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
కందుకూరు ప్రమాదంలో మృతి చెందిన గడ్డం మధుబాబు కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. pic.twitter.com/k473mQ4nh6
— Telugu Desam Party (@JaiTDP) December 29, 2022