ప్రేమను కుటుంబ సభ్యులు కాదన్నారనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి చంపి ఆపై అతడు అదే తుపాకీతో కాల్చుకుని మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం మాలపాటి సురేశ్ రెడ్డి, పొలకూరు కావ్యలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉంటూ ప్రేమించుకున్నారు. వర్క్ఫ్రమ్ హోం సమయంలో వీరి వ్యవహారం కావ్య ఇంట్లో తెలిసింది. సురేశ్తో పెళ్ళికి కావ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో సురేశ్ కావ్యపై కాల్పులు జరిపి ఆపై అతడు కాల్చుకుని మరణించాడు.