గడిచిన 8 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా 40 బిలియన్ల (రూ.3.30 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించింది. టిఎస్ఐపాస్, ఐటి, ఐటిఈఎస్ సెక్టార్లలో ఈ పెట్టుబడులు సాధించినట్లు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. టిఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ద్వారా ఈ పెట్టుబడులను ఆకర్షించగలిగామన్న ఆయన ఈ క్రమంలో 22.5 లక్షల ఉద్యోగాలను రాష్ట్రంలో సృష్టించినట్లు వివరించారు. వీటికి మైనింగ్, రియల్ ఎస్టేట్, హోటల్స్, లాజిస్టిక్స్ రంగాల్లోని పెట్టుబడులు, ఉద్యోగాలను కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువని పేర్కొన్నారు.