మహేష్ బాబు, కీర్తి సురేష్, పరశురామ్ పెట్ల కాంబోలో తెరకెక్కిన సర్కారు వారి పాటకు.. తెలంగాణ సర్కార్ తీపికబురు అందించింది. ఈ మూవీ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12 నుంచి 18 వ తేదీ వరకూ అంటే 7 రోజుల పాటు ఈ మూవీ టికెట్ రేట్ల పెంపునుకు అంగీకరించింది. అదే సమయంలో మొదటి వారం మొత్తం ఈ సినిమాను 5 షోలు వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. ధియేటర్ ను బట్టి టికెట్పై రూ.50, రూ.30 వరకూ పెంచుకోవాలని సూచించింది.