తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా ఆర్టిపిసిఆర్ టెస్టుల్ని ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. దీనిపై దాఖలైన పిల్స్ను విచారించిన చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని బెంచ్ మొత్తం టెస్టుల్లో కేవలం 10 శాతం లోపే ఆర్టిపిసిఆర్ టెస్టులు ఉండడాన్ని తప్పుబట్టింది. 24 గంటలూ వ్యాక్సినేషన్ ఎందుకు జరపడం లేదని మిగతా రాష్ట్రాలు అదే పనిచేస్తున్నాయిగా అంటూ కోర్టు ప్రశ్నించింది.