తెలంగాణలో మద్యం ధరల్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీరు బాటిల్పై రూ.10, క్వార్టర్ లిక్కర్ (90 ఎంఎల్) లిక్కర్ సీసాపై రూ.20, 1000 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై రూ.120 వరకూ ధరల్ని పెంచేసింది. మొత్తంగా చూస్తే దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకూ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన మద్యం ధరలు గురువారం నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. బ్రాండ్లను బట్టి పెంచిన ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది.