తెలంగాణకు రూ.4,200ల కోట్ల పెట్టుబడులు

By udayam on May 28th / 4:34 am IST

స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరమ్​లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.4,200ల కోట్ల పెట్టుబడులను సంపాదించింది. మొబిలిటీ, ఫార్మా, లైఫ్​ సైన్సెస్​, బిఎఫ్​ఎస్​ఐ వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ‘ఈ ట్రిప్​ ఎంతో ఉత్పాదకతను మిగిల్చింది. ఈ అద్భుతమైన పది రోజుల ట్రిప్​ను మరిచిపోలేను’ అంటూ కెటిఆర్​ ట్వీట్​ చేశారు. మొత్తం 45 బిజినెస్​ మీటింగ్​లు జరిపిన కెటిఆర్​, 4 రౌండ్​ టేబుల్స్​, 4 ప్యానెల్​ డిస్కషన్స్​ కూడా జరిపారు.

ట్యాగ్స్​