పోలవరం డెడ్ స్టోరేజ్ వద్ద ఎపి నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జిఆర్ఎంబి ఛైర్మన్కు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. ఎపి నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్తో గోదావరి డెల్టా సిస్టమ్కు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.