రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వనజీవి రామయ్య

By udayam on May 18th / 9:50 am IST

పద్మశ్రీ వనజీవి రామయ్య భద్రాద్రి జిల్లా ఖమ్మంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం ఉదయం పల్లెగూడెంలోని మొక్కలకు నీళ్ళు పోసేందుకు స్కూటర్​పై వెళ్తుండగా ఆయనను మరో బైక్​ ఢీకొట్టింది. దీంతో కింద పడ్డ ఆయన తలకు గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. 2019లోనూ ఆయనకు రోడ్డు ప్రమాదం జరగింది. ఆపై కాస్త కోలుకుని స్వయంగా ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు.

ట్యాగ్స్​