ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లు జరుపుకునేలా యాప్ను అప్డేట్ చేసింది. ఇందుకోసం టోన్ కాయిన్ అనే డిజిటల్ వాలెట్ను తీసుకొచ్చిన ఆ సంస్థ అందులో రీఫిల్ చేసుకున్న క్రిప్టో కరెన్సీలతో పేమెంట్స్ జరపవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ యాప్కు 55 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. గతంలోనూ టెలిగ్రామ్ క్రిప్టో లావాదేవీలను తీసుకురాగా.. ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల నుంచి కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో ఆ నిర్ణయాన్ని నిలిపేసింది.